బాబు ఎండింగ్..పవన్ స్టార్టింగ్..పక్కా ప్లాన్.!

-

ఏపీలో రాజకీయంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కలిసి పనిచేస్తున్నారా? అబ్బే వారు ఎవరికి వారే పనిచేస్తున్నారు..ఎవరి రాజకీయం వారు చేస్తున్నారుగా అని అనుకోవచ్చు. పైకి మాత్రం కలిసిపనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. కానీ అంతర్గతంగా వారిద్దరు కలిసే పనిచేస్తున్నారు. ఇప్పటికే పొత్తు దిశగా ముందుకెళుతున్నారు. పలుమార్లు కలిసి చర్చించారు. అయితే పొత్తు అధికారికంగా ఫిక్స్ కాలేదు. ఇప్పుడు ఎవరికి వారు జనంలో తిరుగుతున్నారు.

తమ పార్టీల బలం పెంచుకునే దిశగా ముందుకెళుతున్నారు. అయితే ఇది పైకి కనిపించే సీన్ అంతర్గతంగా వారి మధ్య ఒప్పందం ఉందనే సంగతి క్లియర్ గా అర్ధమవుతుంది. వారిద్దరు ప్రజల్లో తిరుగుతూ ఒకే రకంగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. అలాగే ఒకరి తర్వాత ఒకరు ప్రజల్లోకి వస్తున్నారు. సరిగా గమనిస్తే బాబు ప్రజల్లో ఉన్నప్పుడు పవన్ ఉండరు. అలాగే పవన్ బయటకొస్తే బాబు ప్రజల్లో ఉండరు. వారాహి మొదట విడత యాత్ర మొదలైనప్పుడు బాబు ప్రజల్లోకి రాలేదు. ఏదో కుప్పంలో మూడు రోజులు తిరిగేసి..తర్వాత పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారు.

రెండో విడత వారాహి యాత్ర జరిగినప్పుడు కూడా అంతే. పైగా పవన్ జనసేనకు బలం ఉన్న సీట్లలోనే పర్యటిస్తున్నారు. ఇక పవన్ రెండో విడత ముగియగానే ఆయన జనసేన పార్టీ పనుల్లో ఉన్నారు. ఇదే సమయంలో బాబు..సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేటీ అంటూ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు తిరిగారు.

ఇప్పుడు ఆయన శ్రీకాకుళంలో చివరి రోజు పర్యటిస్తారు. ఇక ఇటు పవన్ విశాఖలో మూడో విడత వారాహి యాత్ర మొదలుపెడతారు. అంటే బాబు టూర్ ఎండ్ అవుతుంటే, పవన్ టూర్ స్టార్ట్ అవుతుంది. మొన్నటివరకు బాబు..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు పవన్ వంతు. మొత్తానికి ఇద్దరు నేతలు పక్కా స్కెచ్ తో జగన్‌కు చెక్ పెట్టాలని కలిసి పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news