కీలక మ్యాచ్ లో ఇండియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్ … !

-

కాసేపటి క్రితమే వెస్ట్ ఇండీస్ తన మొదటి ఇన్నింగ్స్ ను ముగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్ట్ ఇండీస్ నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మాములుగా ఇన్నింగ్స్ మధ్యలో పూర్తిగా కొలాప్స్ అయిన సమయంలో హెట్ మేయర్ యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కీలకమైన సమయంలో బ్యాట్ తో రాణించి జట్టుకు పోరాడగలిగే స్కోర్ ను అందించాడు. ఒక దశలో 54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉండగా , హెట్ మెయిర్ అద్భుతంగా ఆడి 61 పరుగులు చేసి మంచి టార్గెట్ ను ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్ లో హోప్ 45 రాణించాడు…ముందు మ్యాచ్ లో కూడా హోప్ ఉండి ఉంటే విండీస్ కు గెలుపు అవకాశాలు ఉండేవి.

ఇక ఇండియా బౌలర్లలో కుల్దీప్ సూపర్ గా బౌలింగ్ చేసి కీలకమైన రెండు వికెట్లు తీశాడు.. అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకున్నాడు.. కాగా ఈ లక్ష్యాన్ని ఇండియా ఛేదిస్తుందా లేదా వెస్ట్ ఇండీస్ కు సిరీస్ అప్పగిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news