BREAKING : కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ కసిరెడ్డి!

-

BRS ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హస్తం పార్టీలో చేరాలని ఇప్పటికే కసిరెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఈ సాయంత్రంలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన కసిరెడ్డికి భంగపాటు కలిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

కాగా, ఇక ఇప్పటికే మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. మైనంపల్లి బాటలోనే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం త్వరలో కాంగ్రెస్‌లో చేరనుండగా అటు ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ చేరనున్నారు.

తన మద్దతుదారుల నిర్ణయం మేరకే కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రాథోడ్ బాపురావు పేరు లేదు. బోథ్ నుంచి అనిల్ జాదవ్‌కు టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉండగా కేటీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో పార్టీని వీడేందుకే సిద్ధమయ్యారు రాథోడ్ బాపురావు.

Read more RELATED
Recommended to you

Latest news