కుంజా సత్యవతి హఠాన్మరణం పట్ల కిషన్ రెడ్డి సంతాపము

-

శ్రీమతి కుంజా సత్యవతి గారి హఠాన్మరణం పట్ల కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి సంతాపము తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత శ్రీమతి కుంజా సత్యవతి ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను… 2009-14లో అసెంబ్లీలో వారితో కలిసి పనిచేశాను. గిరిజనుల అభివృద్ధి కోసం ఎప్పుడూ తపనపడే శ్రీమతి సత్యవతి గారు.. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రజాసంక్షేమం విషయంలో తన వాణిని బలంగా వినిపించేవారన్నారు కిషన్ రెడ్డి.

ములుగులో గిరిజన సెంట్రల్ యూనివర్సిటీని మోదీ గారు ప్రకటించిన సందర్భంగా.. వారం రోజుల క్రితం మేడారంలో అమ్మవారిని దర్శించుకుని వారందరి తరపున మోదీ గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం సందర్భంగా.. శ్రీమతి సత్యవతి గారితో మాట్లాడాను. ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనితీరును వారు వివరించారని తెలిపారు. ఇంతలోనే.. ఇలాంటి దిగ్బ్రాంతికరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,జి.కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news