తిరుమల భక్తులకు అలర్ట్‌..ఎల్లుండి ఆ టికెట్లు విడుదల

-

TTD: తిరుమల భక్తులకు అలర్ట్‌. ఎల్లుండి నుంచి ఆన్ లైన్ లో జూలై నెలకు సంభందించిన టికెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. ఎల్లుండి ఉదయం 10 గంటలకు లక్కిఢిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లను విడుదల చెయ్యనుంది టిటిడి. 22వ తేది ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కేట్లు విడుదల కానున్నాయి. ఇక ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానున్నాయి.

Srivari tickets at Tirupati Airport from today

23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టికెట్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు,వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేస్తారు. ఇక 24వ తేది ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల చేస్తారు. ఈ నెల 27వ తేది ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా కోటా విడుదల కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news