వారికి ఎవరికీ సెలవులు ఇవ్వొద్దు..ఏపీ కొత్త సర్కార్‌ ఆదేశాలు !

-

ఏపీకి డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు ఇచ్చింది. తమను రిలీవ్ చేయాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్న డెప్యుటేషన్ పై వచ్చారు పలువురు అధికారులు. ఏపీ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్ కు దరఖాస్తు చేసిన గనుల శాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి….తక్షణం బాధ్యతల నుంచి రీలీవ్ చేయాల్సిందిగా విన్నవించారు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి.

తన మాతృ శాఖకు రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్ ను కోరిన ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి….ఏపీ నుంచి రీలీవ్ చేయాల్సిందిగా దరఖాస్తులు చేసుకున్నారు ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి. గతంలో డెప్యూటేషనుపై వచ్చిన అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది టీడీపీ. తెలంగాణాకు వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్. రావత్ తో పాటు తెలంగాణాకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులూ దరఖాస్తులు చేసుకున్నారు. ఉన్నతాధికారులకెవరికీ సెలవులివ్వొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తన శెలవు ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నారు సీఐడీ చీఫ్ సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news