కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మరో 8 మంది ఎమ్మెల్యేలు!

-

బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాకులు తాకుతున్నాయి. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ కు మరో బిగ్ షాక్ ఇస్తూ తాజాగా ఇంకో 8 మంది ఎమ్మెల్యేలు కారు దిగి చేయందుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, సంజయ్‌ కుమార్‌, మహిపాల్ రెడ్డిలు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.

తాజాగా  బీఆర్ఎస్​కు చెందిన సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు, మేడ్చల్‌, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిలు, కుత్బుల్లాపుర్‌ ఎమ్మెల్యే వివేకానంద, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మినహా మిగిలిన వారితో కాంగ్రెస్‌ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. నగరానికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news