ఆ ప్రాజెక్టును కట్టింది వాళ్లే.. కూలింది కూడా వాళ్ల టైంలోనే : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

తనకు పీసీసీ చీఫ్ పదవి వద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తాను ఆ రేసులో లేనని ఆయన అన్నారు.ఇవాళ మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. పార్లమెంటు సెషన్ పూర్తయ్యాకే వరంగల్ లో రాహుల్ గాంధీ సభ ఉండొచ్చని అన్నారు. మోదీ కార్పొరేట్లకు సంబంధించిన 14 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, తాము ఆరు నెలల్లో 31 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేశామని తెలిపారు.

10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ కేవలం 21 వేల కోట్ల రుణాలే మాఫీ చేశారని అన్నారు. రైతు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రికు, డిప్యూటీ సీఎంకు ఉత్తమ్ ధన్యవాదాలు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఎత్తడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని, వరద వచ్చినందునే గేట్లు ఎత్తామని ఆయన స్పష్టం చేశారు.కాళేశ్వరం రిపేర్లపై ఎన్డీఎస్ రిపోర్టు ఆధారంగానే ముందుకు వెళ్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది వాళ్లే.. కూలింది కూడా వాళ్ల టైంలోననీ అన్నారు. మిషన్ భగీరథ ద్వారా 99% ఇండ్లకు నల్లాలు ఇచ్చామన్నది అబద్ధమని చెప్పారు.10 సంవత్సరాలు నుంచి జల్ జీవన్ కింద నిధులు రాలేదని, కేంద్ర మంత్రి సి ఆర్ పాటిల్ ను నిధులు అడిగినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news