ఇదే కంటిన్యూ అయితే వైకాపా మరో టీడీపీ అవుతుంది !

-

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ పార్టీలో చాలామంది భజన రాయుళ్ల ఉంటారు. అధినాయకుడు మెప్పు పొందటానికి సినిమాల డైలాగులు చెబుతూ మీడియాలో మరియు అసెంబ్లీలో తెగ భజన చేస్తుంటారు. ఇదిలా ఉండగా ఇటీవల చిన్నపిల్లల భోజన పథకం జగన్ గోరుముద్ద పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఈ ప్రభుత్వ పథకాన్ని ఇటీవల ఏర్పాటు చేసింది. స్కూల్ పిల్లలకు ఏడు రకాల ఆహార పదార్థాలతో 7 రోజుల్లో వెరైటీ మెనూను తీసుకు రావడం జరిగింది.

Image result for chandrababu jagan

సోమవారం నుండి శనివారం వరకు సూపర్ భోజనంతో పిల్లలకు పౌష్టికాహారం మెనూలో దొరికే విధంగా అన్ని వెరైటీలతో పాటు వారంలో మూడు రోజులు ఎగ్, చిక్కి తో పాటు ప్రతి రోజు కూడా మంచి భోజనం అందించబోతున్నారట. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఏకంగా భారీ బడ్జెట్ ను కేటాయించింది. అయితే అంతా బాగానే ఉన్నా ఇటీవల ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లాలో ఓ స్కూల్లో వైసిపి పార్టీ నేతలు ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. దీంతో మరోపక్క వైసీపీ భజన రాయులు…భజన స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు.

 

ఆ స్కూల్ ప్రాంగణంలో ఉన్న పిల్లల చేత భోజనం ఎలా ఉన్నదో చెప్పించడం తో పాటు స్కూల్ టీచర్స్ తో కూడా మధ్యాహ్నం భోజనం గురించి గొప్పగా చెప్పే వరకు వాళ్లని విడిచిపెట్టలేదు వైకాపా పార్టీ నేతలు. దీంతో ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ మీడియాలో మరియు అదే విధంగా సోషల్ మీడియాలో రావడంతో వైసిపి పార్టీ కూడా త్వరలోనే తెలుగుదేశం పార్టీ అయ్యేటట్టు ఉందని అంటున్నారు నెటిజన్లు. చేసే పని తక్కువ-హడావుడి ఎక్కువ అయిపోయింది అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news