విశాఖపట్నం: తెలుగు ప్రజలను భయపెడుతున్న చెడ్డీ గ్యాంగ్ విశాఖ నగరంలో సంచరిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. దీంతో విశాఖ నగరంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర శివార్లలోని పోతిన మల్లయ్యపాలెంలోని పనోరమా హిల్స్లో 66 నెంబర్ విల్లా వద్ద ఈ గ్యాంగ్ సంచరించినట్లు అక్కడి సీసీ కెమెరా దృశ్యాల అధారంగా పోలీసులు నిర్ధారించారు. దీంతో వీరి ఆచూకీ కోసం విస్తృత గాలింపు చేపట్టారు. ఈ విల్లా యజమాని లక్ష్మీనారాయణ హైదరాబాద్ నివాసి. అప్పుడప్పుడు విశాఖ వచ్చి వెళ్తుంటాడు. ప్రస్తుతం ఈ విల్లాలో చోరీ జరగనప్పటికీ.. చెడ్డీ గ్యాంగ్ గతంలో నగర శివార్లలో దొంగతనాలకు పాల్పడిన ఘటనలున్నాయి. వీరిని పట్టుకుంటే నగరంలో జరిగిన చోరీలకు సంబంధించి ఆధారాలు దొరికే అవకాశం ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
విశాఖలో చెడ్డీగ్యాంగ్ కలకలం!
By Anil Kumar
-
Read more RELATEDRecommended to you
BREAKING : గుంతలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు విద్యార్థులు దుర్మరణం
ఉత్తరా ఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది....
కన్నతల్లిపై రేప్.. సుత్తితో కొట్టి కొడుకును చంపిన తల్లిదండ్రులు
సొంత కుమారుడిని తల్లిదండ్రులే చంపి గోనె సంచిలో చుట్టి బయట పడేసిన...
BREAKING : లోయలో పడ్డ బస్సు.. 10 మంది దుర్మరణం
పాకిస్థాన్లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 10...