మిరపలో తామర పురుగు నివారణ చర్యలు..

-

మిరప అధిక లాభలను ఇచ్చే పంట.. అయితే తెగుళ్లు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా తామరపురుగులు కూడా ఎక్కువే.. వీటి నుంచి కాపాడితే మంచి లాభలను పొందవచ్చు.. సాధారణంగా పురుగులు ఆకుల్లోని రసం పీలుస్తాయి. కానీ ఈ కొత్త రకం పురుగు మాత్రం పువ్వుల్లోని పుప్పొడిని సైతం పీల్చి పూత, కాత లేకుండా చేస్తుంది. ఈ పురుగులు ఎటువంటి మందులకు పోవు..పాత వ్యవసాయ పద్ధతుల ద్వారా అరికట్టాలి.

పసుపు రంగు, నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 40 చొప్పున ఏర్పాటు చేసుకోవాలని, చెట్టుపై కాకుండా నేలపై ఫిప్రోనిల్‌ గుళికలు వాడాలని చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతానికి స్పైనోస్పాడ్‌ లేదా ఎసిటామిప్రైడ్‌ లేదా ఇమిడాక్లోప్రిడ్‌ వంటి మందులు లీటరుకు 3 గ్రాముల వేప కషాయాన్ని కలిపి వాడుకోవాలి. వాటిని మార్చి పిచికారీ చేయాలి. పొలంలో చెత్తను ఎండకాలం కాల్చకుండా కాంపోస్‌ బ్యాక్టీరియాను వాడి కుళ్లబెట్టాలి అప్పుడు కార్బన శాతం నేలలో పెరుగుతుంది… అలా చెయ్యడం వల్లే పోషకాలు అందుతాయి..

మిరప మొక్కలను నాటిన తరువాత 10 నుండి15 రోజులకు ఒకసారి బవేరియా బాసియన మరియు వర్తిసెల్లము కలిపి సాయంత్రం స్ప్రే చేసుకోవాలి. విత్తనాలు లేదా నారు నాటకముందు ట్రెక్‌ డెర్మ విరుడి, సూడో మోనాస్‌ వంటి వాటిని పశువుల ఎరువుతో కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకుని వెదజల్లి బెడ్‌ కట్టుకోవాలి.. అలాగే పొలం చుట్టూ బంతి మొక్కలను నాటలి..జిగురు అట్టలు, బుట్టలు పెట్టాలి.. పక్షులకు స్థావరాలను కూడా పెట్టాలి..ఎప్పుడు తేమ ఉండేలా కాకుండా ప్లాన్‌ చేయాలి. యూరియాను సాధ్యమైన వరకు తగ్గించాలి. హై డెన్సిటిలో మొక్కలు నాటకుడదు. సూక్ష్మ పోషకాలు అందివ్వాలి. నారును కొనకుండా పెంచుకోవడం మంచిది.అప్పుడే ఆ పురుగులను అరికట్టవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news