వేధింపులు ఎదుర్కొంటున్న ఆదాశర్మ.. ఏమైందంటే..?

-

ప్రముఖ హీరోయిన్ ఆదాశర్మ తాజాగా నెట్టింట వేధింపులకు గురి అవుతోంది. ఎవరో కొంతమంది వ్యక్తులు ఆమె కాంటాక్ట్ డీటెయిల్స్ పర్సనల్ ఫోన్ నెంబర్ ను లీక్ చేయగా ఆమెను తీవ్రస్థాయిలో వేధిస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ జనాలలో చర్చనీయాంశంగా మారింది. ది కేరళ స్టోరీ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఆదాశర్మ.. సుదీప్తోసేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పలు వివాదాల నడుమ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా ఎన్నో వివాదాలు, గొడవలు , కోర్టు కేసులు అంటూ.. విడుదలై పలు చర్చలకు తావిచ్చిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా కేరళలో మతపరమైన విభజన దేశాన్ని ప్రచారం చేయాలని ఉద్దేశంతోనే ఈ సినిమా తీశారు అనే వార్తలు కూడా వినిపించాయి. అంతేకాదు కొన్ని చోట్ల థియేటర్లలో ఈ సినిమాను ఆపివేశారు కూడా.. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.. ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్ క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. ఇకపోతే ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన ఆదాశర్మకు మంచి గుర్తింపు లభించిందని చెప్పాలి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో తాజాగా ఆమె నంబర్ లీక్ కావడంతో కొందరు వ్యక్తులు ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.

సదరు ఇంస్టాగ్రామ్ యూజర్ను ఆమె డిఆక్టివేట్ చేయగా.. తనే ఆదాశర్మ కొత్త కాంటాక్ట్ నెంబర్ ను కూడా లీక్ చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. ఆమె కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు వైరల్ కావడంతో కొంతమంది కావాలని అటాక్ చేస్తున్నారు. ఇకపోతే ఆదాశర్మ ఫోన్ నెంబర్ లీక్ చేసిన సదరు సోషల్ మీడియా యూజర్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్, ముంబై ట్విట్టర్ హ్యాండిల్స్ కు ట్యాగ్ చేస్తూ ఆమె అభిమానులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఆదాశర్మ మాత్రం ఈ విషయంపై ఇంకా నేరుగా రియాక్ట్ కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news