NTR ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. మే 28న ‘అడవిరాముడు’ రీ రిలీజ్

-

టాలీవుడ్​లో రీ రిలీజ్​ల ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు మెగాస్టార్, పవర్ స్టార్, బాలయ్య వంటి అగ్రహీరోల సినిమాలే రిలీజ్ అయ్యాయి. ఇక నుంచి ఆనాటి పాత సినిమాలు కూడా రీ రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందాల రాముడు.. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ సినిమాలు రీ రిలీజ్ చేసే పనిలో పడ్డారు నిర్మాతలు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్.. ‘అడవి రాముడు’ సినిమాను 4కే వెర్షన్​లో రీ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా ఆయన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘అడ‌వి రాముడు’ను రీ రిలీజ్ చేయనున్నారు. మే 28న తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవ‌ర్‌సీస్‌లోనూ ఈ సినిమా స్పెష‌ల్ ప్రీమియ‌ర్స్ స్క్రీనింగ్ వేయనున్నారు. ఈ సినిమా ప్రింట్స్‌ను రీ మాస్ట‌రింగ్ చేసి 4కే రిసొల్యూషన్​తో విడుదల చేయనుండటం విశేషం. ఈ చిత్రం ద్వారా వ‌చ్చే క‌లెక్ష‌న్స్‌ను సేవా కార్య‌క్ర‌మాల కోసం వినియోగిస్తారని సమాచారం అందింది.

Read more RELATED
Recommended to you

Latest news