బ్యూటీ ఇన్ రెడ్: ఏమాత్రం అందం తగ్గలేదు.. ఇంకా మిస్ వరల్డే..!

-

Aishwarya Rai Bachchan wore a scarlet ensemble by Manish Malhotra in Doha Event

కొందరికి వయసు పెరుగుతున్నా కొద్దీ అందం కూడా పెరుగుతుంది. ఆ కోవలోక వస్తుంది అందాల తార ఐశ్వర్యారాయ్. అవును.. ఆమె వయసు ఎంత పెరుగుతున్నా.. అందం మాత్రం తగ్గడం లేదు. ఇన్ ఫాక్ట్ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఆమె అప్పుడప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన ఫ్యామిలీ ఫోటోలు, తను ఏదైనా ఈవెంట్ లో పాల్గొంటే వాటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఖతర్ లోని డోహాలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఐష్.. ప్రముఖ డిజైనర్ మనిష్ మల్హోత్రా డిజైన్ చేసిన రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని హల్ చల్ చేసింది. డ్రెస్ తో పాటు తను ధరించిన జ్యుయెలరీ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. డోహాలో జరిగిన డోహా జ్యూయలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ 2019 ఈవెంట్ లోనే ఐష్ పాల్గొన్నది. ఈ ఈవెంట్ లో అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్లు పాల్గొన్నారు.

ఐశ్వర్యకు రెడ్ కలర్ అంటే ఇష్టం కాబోలు. అందుకే.. ప్రతి అకేషన్ కు రెడ్ డ్రెస్ వేసుకొని అలరిస్తుంటుంది. ఇక.. డోహా జ్యూయలరీ ఈవెంట్ లో ఐష్ వేసుకున్న డ్రెస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా రోజుల తర్వాత మాజీ మిస్ వరల్డ్ ను మళ్లీ అందంగా చూడటంతో నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు.

 

View this post on Instagram

 

✨❤️✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

 

View this post on Instagram

 

❤️

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

 

View this post on Instagram

 

✨?LOVE OF MY LIFE ????✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

Read more RELATED
Recommended to you

Latest news