తేజ్ కోసం బన్ని సాక్రిఫైజ్

-

మెగా హీరోల్లో అందరి కెరియర్ బాగానే ఉన్నా మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కెరియర్ మాత్రం సందిగ్ధంలో ఉంది. కెరియర్ మొదట్లోనే హిట్లు కొట్టి సుప్రీం స్టార్ అనే స్క్రీన్ నేం కూడా అందుకున్న సాయి ధరం తేజ్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేస్తున్నాడు సాయి ధరం తేజ్.

ఇదిలాఉంటే గీతా గోవిందం తర్వాత పరశురాం మరోసారి గీత ఆర్ట్స్ లోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే స్టోరీ ఓకే చేశారట. అయితే పరశురాం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట. బన్నికి కూడా ఆ కథ నచ్చిందట కాని అరవింద్ చొరవతో ఆ సినిమా తేజూకి వెళ్లేలా చేస్తున్నారట. మెగా హీరోల కెరియర్ మీద చిరంజీవి, అరవింద్ ఓ కన్నేసి ఉంచుతారు. అందరి కెరియర్ బాగానే ఉన్నా చిరు పోలికలు ఉన్న సాయి ధరం తేజ్ కాస్త వెనుకపడ్డాడు. అందుకే పరశురాం తేజూతో సినిమా తీసేలా ప్లాన్ చేస్తున్నారట.

సాయి ధరం తేజ్ కోసం బన్ని చేస్తున్న ఈ త్యాగం అతని కెరియర్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. బన్ని ఎలాగు త్రివిక్రం తో సినిమా లైన్ లో పెట్టాడు. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. హ్యాట్రిక్ కాంబోగా త్రివిక్రం, బన్ని సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news