అల్లు అర్జున్ సుకుమార్ సినిమా లేటెస్ట్ అప్‌డేట్ అదిరిపోయిందిగా ..!

-

అల్లు అర్జున్ రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుక వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మంచి రికార్డ్ ని సాధించింది. అల్లు అర్జున్ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.

 

ఇక ప్రస్తుతం అల్లు అర్జున సుకుమార్ దర్శకత్వం లో నటిస్తున్నారు. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్‌ సుకుమార్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావడం తో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ కొంత టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ నటుడు విజయ సేతుపతి విలన్ గా నటించనున్నాడని సమాచారం. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎక్కువ భాగం శేషాచలం అడువుల్లోనే తెరకెక్కనుందని తెలుస్తుంది. అయితే ఈసినిమాకి శేషాచలం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా మేకర్స్ ఒక లేటెస్ట్ అప్‌డేట్ ని రివీల్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఒకటి ఏప్రిల్ 8 న ఉదయం 9 గంటలకి మేకర్స్ రిలీజ్ చేయనున్నారని ఒక పోస్టర్ ని వదిలి క్లారిటి ఇచ్చారు. ఈ పోస్టర్ లో ఉన్న దాన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ రాయల సీమ యాస లో మాట్లాడతారని అర్థమవుతుంది. ఇక ఏప్రిల్ 8 న ఉదయం 9 గంటలకి ఈ సినిమా నుంచి టైటిల్ తో పాటు అల్లు అర్జున్ లుక్ ని రిలీజ్ చేస్తారని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news