BREAKING : రేపే తెలంగాణకు అమిత్ షా…ప్రభాస్ కీలక సమావేశం !

-

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించిన కన్నుమూసిన సంగతి అందరికీ విదితమే. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజు సేవలను స్మరించుకున్నారు. కృష్ణం రాజు రౌద్ర రస రారాజుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.

కాగా కృష్ణంరాజు గారికి చిత్ర సీమకు చెందిన పలువురు సినిమా ప్రముఖులు, జర్నలిస్టు సోదరులు ఇప్పటికే సంతాప సభలు ఏర్పాటు చేసి వారికి ఘన నివాళి అందించారు. అయితే విషయం ఏమిటంటే కృష్ణంరాజు గారి కుటుంబ సభ్యులని సెప్టెంబర్ 16న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలవనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజున ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా అనంతరం కృష్ణంరాజు గారి ఇంటికి వెళ్లి ఆయన సతీమణి శ్యామల గారిని, హీరో ప్రభాస్ ని కలిసి నివాళులు అర్పించనున్నట్లు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news