ఒకే ఫ్రేమ్ లో బాలయ్య , ప్రభాస్ కనిపించబోతున్నారా..?

-

ప్రస్తుతం బాలయ్య ఆహ లో అన్ స్టాపబుల్ అనే టాక్ షోకు హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సాధారణంగా ఇలాంటి షో లకు స్టార్ హీరోలు దూరంగా ఉంటారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ మొదటి సీజన్లో ఎంతో మంది స్టార్ హీరోలను తీసుకువచ్చి మరింత క్రేజ్ సంపాదించుకుంది ఆహా సంస్థ. తాజాగా అన్ స్టాపబుల్ షో కోసం బాలకృష్ణ స్టార్ హీరోలను రంగంలోకి దింపే పనిలో పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలయ్య హోస్టుగా ఉండటం వల్ల ఈ షో కి మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు.

ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలలో పవన్, చిరు ,మహేష్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తదితర హీరోలు ఈ టాక్ షోలో పాల్గొనాలని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం నిర్మాత నాగవంశీ అన్ స్టాపబుల్ షో కి హాజరై త్రివిక్రమ్ కి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ను ఈ షో కి తీసుకురావాలని పరోక్షంగా తెలియజేయడం జరిగింది. చిరంజీవితో కూడా ప్లానింగ్ ఉందని టాక్ బాగా వినిపిస్తూ ఉన్నది. వీరి తర్వాత కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తో కలిపి కూడా ఇందులో ఒక ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా ఆహా సంస్థ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

వీరందరూ కంటే ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ తో కూడా ఒక ఎపిసోడ్ ఉండబోతుందని సమాచారం. గీతా ఆర్ట్స్ సంస్థకు, యూవీ క్రియేషన్ సంస్థకు మధ్య సన్నిహిత్యం ఉండడం వల్లే ప్రభాస్ ఈ షో కి రాబోతున్నారు అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రభాస్ కాల్ షీట్లు ఖాళీగా లేకపోవడం వల్ల అతడు ఏ టైం కి వస్తాడు అన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ -k సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అన్ స్టాపబుల్ కి ప్రభాస్ ఎంట్రీ పై ఆహా సంస్థ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news