బాలయ్య, గోపిచంద్ ఎంట్రీతో దద్దరిల్లిన భ్రమరాంబ థియెటర్..ఫ్యాన్స్ హంగామాతో..

-

నందమూరి బాలయ్య ,గోపిచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా వీర సింహారెడ్డి..భారీ అంచనాలతో ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఉదయం 4 గంటలకే మొదటి షో పడింది..ఎప్పటిలాగే ఫ్యాన్స్ హంగామా తారా స్థాయికి చేరింది..సంక్రాంతి పండగను అభిమానులకు రెండు రోజుల ముందే తెచ్చింది ఈ చిత్రం. తెలంగాణ ప్రభుత్వం ఆరో షోకి అనుమతి ఇవ్వడంతో.. తెల్లవారుజామున 4 గంటల నుంచే షోలు మొదలయ్యాయి. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం ఓ రేంజ్ లో సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా వీర సింహా రెడ్డి రిలీజైన థియేటర్ల వద్ద బాలకృష్ణ ఫ్యాన్స్ సందడి నెలకొంది.

మరోవైపు భాగ్యనగరంలోనూ పలు థియేటర్స్ వద్ద అభిమానులతో పాటు పలువురు సెలబ్రెటీలు సందడి చేశారు. ముఖ్యంగా కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ వద్ద అభిమానుల హంగామా ఓ రేంజ్ లో సాగింది. సంక్రాంత్రి సంబరాలను దీపావళి అన్న రేంజ్ లో చేశారు. క్రాకర్స్ కాలుస్తూ.. డప్పులు, డ్యాన్స్ లతో హంగామా సృష్టించారు. థియేటర్ వద్ద బాలయ్య బాబు,గోపి చంద్ మలినేని సహా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ తో కలిసి సందడి చేశారు. థియేటర్ లో అభిమానుల మధ్య కూర్చుని హీరో బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని చూశారు.

అదే విధంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లోనూ అదరగొట్టింది. వాస్తవంగా చెప్పాలంటే… బాలయ్య కు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ ఇదే మొదటిసారి. అడ్వాన్స్ బుకింగ్ తో హైదరాబాద్‌లో 11.42 లక్షలు, బెంగళూరులో 30 లక్షలు, చెన్నైలో 4 లక్షలు, వరంగల్‌లో 17.58 లక్షలు, ముంబైలో 1.52 లక్షలను అందుకోవటం విశేషం.. అనుకున్న దానికంటే ఎక్కువగానే ఈ సినిమాకు మంచి టాక్ వస్తుంది..ఇదంతా చూస్తుంటే సినిమా భారీ హిట్ అవ్వడం ఖాయమని టాక్..

Read more RELATED
Recommended to you

Latest news