మెరూన్ కలర్ లో మెరిసిపోతున్న భానుశ్రీ..

-

పాపులారిటీ విషయంలో సినిమా తారలకి టెలివిజన్ నటీనటులు ఏమాత్రం తీసిపోరు. స్టార్ హీరో హీరోయిన్లని పక్కన పెడితే క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఉండే పాపులారిటీ టెలివిజన్ లో కనిపించే వారికి కూడా వస్తుంది. ఒకదశలో టెలివిజన్ వారికే ఎక్కువ పాపులారిటీ వస్తుందని చెప్పాలి. ఇక బుల్లితెర యాంకర్లకైతే చెప్పక్కర్లేదు. టెలివిజన్ మీద వారే స్టార్ హీరోయిన్లు. అందుకే వారికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.

సుమ, శ్రీముఖి, అనసూయ, రష్మీ గౌతమ్.. యాంకర్లు టెలివిజన్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నారో తెలిసిందే. ఐతే వారికి పోటీగా అన్నట్టుగా కొత్త యాంకర్ తెరమీదకి వచ్చింది. బాహుబలి సినిమాలో తమన్నాకి డూప్ గా నటించిన భానుశ్రీ, ఆ తర్వాత బిగ్ బాస్ రెండవ సీజన్లో కనిపించి అందరికీ పరిచయం అయ్యింది. బిగ్ బాస్ లో ఆమెకి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దానికి ముఖ్య కారణం ఆమె అందం ఒకటయితే, ఆమె గొంతు రెండవ కారణం.

వినడానికి కొంచెం టిపికల్ గా అనిపించినా భానుశ్రీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే బిగ్ బాస్ తర్వాత ఏడు చేపల కథ అనే సినిమాలో కనిపించిన ఈ అమ్మడు అదిరింది కామెడీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి, భానుశ్రీ జోడీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వస్తుంది. ఐతే సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే భానుశ్రీ, ట్విట్టర్ ద్వారా ఫోటోలని షేర్ చేసింది.

మెరూన్ కలర్ లెహెంగాలో మెరిసిపోతూ ఫోటోకి ఫోజులిచ్చింది. విరబోసిన జుట్టుతో, చెవులకి రింగులతో చూడగానే ముచ్చటగా అనిపించేలా ఉంది. లెహెంగాలో కనిపిస్తున్న నడుమందాలు అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బుల్లితెర మీద తన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న భానుశ్రీ, సినిమాలలోనూ అవకాశాలు తెచ్చుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news