Big Boss OTT Telugu: ఈ వారం ఎలిమినేషన్‌పై కంటెస్టెంట్స్‌లో ఉత్కంఠ..ఒక్కొక్కరికి నాగార్జున క్లాస్

-

బిగ్ బాస్ ఆరో సీజన్ ఓటీటీ తెలుగు షోలో ఏడోవారం ఆదివారం ఎపిసోడ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నది. ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. సదరు ప్రోమో నెట్టింట తెగ వైరలవుతోంది. హోస్ట్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్స్ అందరినీ ఒక్కొక్కరుగా టార్గెట్ చేశారు.

తొలుత కెప్టెన్ గా వ్యవహరించిన అషురెడ్డిపైన మాట్లాడారు నాగార్జున. అషురెడ్డి పేరిట ఉన్న జెండాను విరిచేసి కెప్టెన్సీ అండే కొన్ని సీలు ఉండాలని, కానీ, ఒక్క సీ కూడా అషుకు లేదని అన్నాడు. తర్వాత శివ- నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే వారి జెండాలను చించేయబోతుండగా, నటరాజ్ మాస్టర్ అడ్డుపడ్డారు.

ఆట ఆడటమే కాదు..ఆటలో పరిణతి కనబరచడం కూడా చాలా ముఖ్యమని నాగార్జున ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ కు క్లాస్ ఇచ్చారు. అనిల్ – హమీదలను ఉద్దేశించి ఆటలో ఆవేశం పనికి రాదని పేర్కొన్నాడు. రూల్ ప్రకారం జరగని వ్యవహారాలను వీడియో వేసి మరీ అషురెడ్డికి నాగార్జున చూపించారు.

చివరకు ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ ప్లేయర్స్ గా భావించబడుతున్న అఖిల్- బిందు మాధవిలకు క్లాస్ పీకాడు నాగ్. ఇద్దరూ బొక్క బోర్ల పడ్డారని అన్నాడు. తర్వాత ఏం జరిగింది ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు తెలియాలంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో స్ట్రీమ్ అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news