BREAKING : రామ్ గోపాల్ వర్మపై బీజేపీ పోలీస్ కేసు..!

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు. కాగా, తాజాగా బీజేపీ పార్టీ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై సంచలన ట్వీట్‌ చేశారు ఆర్జీవీ.

“ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు అంటే ఎవరు? ” అంటూ సంచలన ట్వీట్‌ చేశారు వర్మ. అయితే.. దీనిపై బీజేపీ పార్టీ చాలా సీరియస్‌ అయింది. ఇందులో భాగంగానే.. రామ్ గోపాల్ వర్మ పై అబిడ్స్ పి ఎస్ లో ఫిర్యాదు చేయనుంది బీజేపీ పార్టీ. రామ్ గోపాల్ వర్మ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నారు బీజేపీ పార్టీ నేతలు. ఈ విషయంపై కేంద్ర బీజేపీ పార్టీకి కూడా ఫిర్యాదు చేయనుంది రాష్ట్ర బీజేపీ.

Read more RELATED
Recommended to you

Latest news