బాలీవుడ్ హీరోయిన్స్ వెంటపడటం ఏంటి డార్లింగ్ ..వాళ్ళు మనకి దెబ్బేస్తున్నారు కదా ..!

-

ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. అందుకే ఏ డైరెక్టర్ అయినా ఆయనతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ సినిమానే తీయాలనుకుంటునారు. ఈ నేపథ్యంలోనే మహానటి ఫేం నాగ్ అశ్విన్ తో సినిమా చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు దర్శక, నిర్మాతలు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని సెలెక్ట్ చేయాలని చూస్తున్నారట. అయితే కత్రినా అంతగా ఆసక్తి చూపించకపోవటంతో ఇప్పుడు ఆలియా భట్ ని తీసుకుందామని చర్చలు జరుపుతున్నారట.

 

 

సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు అశ్వనిదత్ – నాగ్ అశ్విన్ సిద్దమవుతున్నారట. ఆ నేపథ్యంలోనే పాన్ ఇండియా రేంజ్ కోసం బాలీవుడ్ హీరోయిన్స్ లో కత్రిన లేదా ఆలియాని ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ఇక ఇప్పటికే ఆలియా ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గనక బ్లాక్ బస్టర్ అయితే టాలీవుడ్ లో ఆలియా క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది.

అంతేకాదు ప్రభాస్ – ఆలియా భట్ కాంబినేషన్ హిందీ మార్కెట్ కి బాగా ప్లస్ అవుతుందని మేకర్స్ ధీమా . అయితే నాగ్ అశ్విన్ తో పాన్ ఇండియా సినిమాకి కత్రినా కైఫ్ ను ఎంపిక చేయాలన్న ఆలోచనపైనా ప్రభాస్ అభిమానుల్లో రక రకాల అభిప్రాయాలున్నాయి. ప్రభాస్ పక్కన ఆలియా కంటే కత్రినా కైఫ్ అన్ని విధాల సరిగ్గా సరిపోతుందని డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు మిగతా ఆడియన్స్ కూడా సలహాలిస్తున్నారు. మరి చివరికి మన మేకర్స్ ఏం చేస్తారో చూడాలి. అయితే ఇక్కడ ప్రభాస్ కి బాలీవుడ్ హీరోయిన్స్ కలిసి రావడం లేదు. సాహో సినిమాలో ఇలానే భావించి శద్ద కపూర్ ని తీసుకున్నారు. కాని ఆ హీరోయిన్ మనవాళ్ళకి నచ్చలేదు. అదే ఇప్పుడు కొంతమంది అంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news