అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ యంగ్ హీరో.. సమంతా కంటే ఘోరం..!

-

ఈ మధ్యకాలంలో తరచూ హీరోయిన్లే కాదు హీరోలు కూడా అరుదైన వ్యాధి బారిన పడుతూ అభిమానులను మరింత కలవర పెడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇప్పుడు తాజాగా మరొక బాలీవుడ్ సెలబ్రిటీ కూడా ఈ విధంగానే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తానే స్వయంగా వెల్లడించారు. అతను ఎవరో కాదు బాలీవుడ్ యంగ్ హీరో.. మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ ధావన్.

కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించడంతోపాటు తన డాన్సులతో కూడా ఇరగదీస్తూ ఎంతోమంది ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్నారు. తాజాగా “వెస్టిబ్యులర్ హైపో ఫంక్షన్ ” అనే ఒక రకమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇటీవలే వరుణ్ ధావన్ భేడియా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా తాను వెస్టిబ్యులర్ హైపో ఫంక్షన్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ కారణం వల్ల ప్రస్తుతం తన సినిమా షూటింగ్లకు కూడా దూరంగా ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు వరుణ్ ధావన్ వెల్లడించారు.

ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే.. శరీరంలోని బ్యాలెన్స్ కోల్పోవడం తో పాటు వికారం, వాంతులు, ఒకచోట సరిగ్గా కూర్చోలేకపోవడం, నిలబడలేకపోవడం, కొన్నిసార్లు శరీరంపై పూర్తిగా నియంత్రణ లేకుండా పోవడం , ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలుగా పరిగణించవచ్చు. అలాగే ఈ వ్యాధి చెవి నుంచి మెదడుకు చేరే సంకేతాలను కూడా అడ్డుకుంటుంది. దీనివల్ల కళ్ళు తిరగడం, కళ్ళు మసకబారడం లాంటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా వరుణ్ ధావన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news