రికార్డుల పేరుతో మహేష్, బన్నీ సినిమా నిర్మాతల కొట్లాట

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా అలవైకుంఠపురములో ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలిరోజు తొలిషో నుండి ఒకింత మంచి టాక్ సంపాదించిన ఈ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ తన గత సినిమాల్లోని సీన్స్ కొన్నిటిని కాపీ కొట్టి తీశారు అనే విమర్శలు ఎదురయ్యాయి. అలానే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ అంతగా ఆకట్టుకోదని, మధ్యలో వచ్చే ల్యాగ్స్ కారణంగా సినిమా కొంత బోర్ కొడుతుందని కూడా కొందరు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేసారు. అయితే సంక్రాంతి సీజన్ కావడం ఈ సినిమాకు కొంతవరకు కలిసి వచ్చింది. ఇక ఈ సినిమా తో పాటు సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు కూడా కేవలం ఒక్కరోజు తేడాలో రిలీజ్ అయి యావరేజ్ టాక్ సంపాదించడం జరిగింది. అయితే దానికి కూడా సూపర్ స్టార్ మహేష్ స్టార్డం తో పాటు సంక్రాంతి పండుగ కలిసి రావడంతో కలెక్షన్స్ అదరగొట్టేలా లభించాయి.

అయితే మొదటి నుండి ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య కలెక్షన్స్ వివాదం జరుగుతూ వస్తోంది, తమ సినిమా అంత కలెక్ట్ చేసిందని ఒకరు అంటే, లేదు మా సినిమా అంతకు మించి కలెక్ట్ చేసిందంటూ ఇంకొకరు అనడం మొదలెట్టారు. ఇక ఇటీవల ఈ రెండు సినిమాలు కూడా రూ.100 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడం జరిగింది. కాగా సరిలేరు సినిమా ఇటీవల రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని దాటేసినట్లు ఆ సినిమా ఒంటి ఒక పోస్టర్ రిలీజ్ చేయగా, ఆ వెంటనే అల మూవీ యూనిట్, తమ సినిమా రూ.220 కోట్ల గ్రాస్ కొల్లగొట్టినట్లు పోస్టర్ విడుదల చేయడం జరిగింది.

 

అయితే కావాలనే మహేష్ సినిమా కలెక్షన్స్ కు పోటీగా అల మూవీ యూనిట్ వారు అత్యధిక కలెక్షన్స్ తో పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారని కొంత విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి అల సినిమా ఓవర్సీస్ లో బాగా రాబడుతుంటే, సరిలేరు సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా సాగుతోంది. ఇక ఈ విధంగా ఈ రెండు సినిమాల నిర్మాతలు ఒకరిని మాఇంచేలా మరొకరు కలెక్షన్స్, రికార్డ్స్ పేరుతో పోస్టర్లు రిలీజ్ చేయడం సరైనది కాదని కొందరు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ రెండు సినిమాల మధ్య వార్ ఎప్పటికి మూగుస్తుందో చూడాలి…..!!

 

Read more RELATED
Recommended to you

Latest news