రామ్ చరణ్ దూకుడుకి షాక్ అయిన చిరంజీవి…!

-

సాధారణంగా యువ హీరోలు సినిమాల్లో పెట్టుబడులు పెట్టాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క సినిమా ఇబ్బంది పెడితే ఆ తర్వాత భారీగా నష్టాలు వస్తాయి. దీనితో చాలా మంది పెట్టుబడులు పెట్టాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన మాత్రం ఎక్కడా భయపడటం లేదు. సినిమా ఫ్లాప్ హిట్ తో సంబంధం లేకుండా పెట్టుబడులు పెడుతున్నారు.

చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 తో ఆయన టాలీవుడ్ లో నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. ఆ ప్రయత్నం విజయవంతం అయింది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా సైరా నరసింహా రెడ్డి సినిమాను రూపొందించారు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. భారీగా నష్టాలు కూడా వచ్చాయనే ప్రచారం టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతుంది. అయితే ఈ తరుణంలో వెనక్కి తగ్గాల్సిన రామ్ చరణ్ దూకుడుగా అడుగులు వేస్తున్నాడు.

ప్రస్తుతం తన తండ్రి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లూసిఫర్ అనే సినిమా హక్కులను మలయాళ నిర్మాత నుంచి కొనుగోలు చేసాడు. ఇక ఆ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. దీనితో చిరంజీవి ఒక్కసారిగా షాక్ అయ్యారు. రామ్ చరణ్ ని కాస్త దూకుడు తగ్గించాలని కోరారట. అప్పుడే తొందర పడవద్దని సూచించారట.

Read more RELATED
Recommended to you

Latest news