అటు విహారయాత్ర.. ఇటు వీరయ్య యాత్ర – చిరంజీవి ట్వీట్ వైరల్

-

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి ఐటెం సాంగ్ చేసింది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2023 జనవరి 13న థియేటర్లలోకి రాబోతుంది. అయితే తాజాగా చిరంజీవి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ” ఫ్యామిలీతో అటు విహారయాత్ర.. హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర ” అని పోస్ట్ చేశారు మెగాస్టార్. తన ఫ్యామిలీతో పాటు శృతిహాసన్తో దిగిన ఫోటోని కూడా షేర్ చేశారు. కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news