మూడు రోజుల్లో 100 కోట్లు బెట్టింగ్ వేస్తున్న చిరు ఫ్యాన్స్.!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా 13 తేదీన థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక విడుదల అయిన అన్ని థియేటర్స్ లో అన్ని చోట్ల అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు . చిరు అభిమాని అయిన బాబీ మెగాస్టార్ ను చక్కగా ప్రజెంట్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. మాస్ ఎలివేషన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయాయని గాట్టిగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కూడా వసూళ్ళు వర్షం కురిపిస్తూ ఉంది.మొదటి రోజు రూ.55 కోట్లకుపైనే గ్రాస్ వసూళ్లు సాధించిన మెగాస్టార్‌ రెండో రోజూ తన హవా కొనసాగించింది.

ఇక రెండో రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ .75.50 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం చిరు ఫ్యాన్స్ మాత్రం మూడో రోజు ఖచ్చితంగా వంద కోట్లు వసూళ్లు సాధించి రికార్డ్ బ్రేక్ చేస్తుందని బెట్టింగ్ వేస్తున్నారు. అసలే సంక్రాంతి కోడి పందాలు జరిగే ప్రదేశాలలో బాలయ్య ఫ్యాన్స్ చిరు ఫ్యాన్స్ కూడా బెట్టింగ్ వేస్తున్నారు. ఎలా అయినా సంక్రాంతి అలాగే సండే కావడం తో ఖచ్చితంగా వంద కోట్లు వసూళ్లు వస్తాయని చిరు ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news