ట్రిపుల్ ఆర్ కోసం ఆ క్రేజీ రైటర్..!

-

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ మరో నెల రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. మెగా నందమూరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా నుండి ఓ స్పెషల్ అప్డేట్ సిని ప్రియులను అలరిస్తుంది. సినిమాకు ఓ క్రేజీ రైటర్ పనిచేస్తున్న విషయం తెలుస్తుంది. అతనెవరో కాదు సాయి మాధవ్ బుర్ర.

క్రిష్ పరిచయం చేసిన ఇతను రైటర్ గా తన పెన్ పవర్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్, సైరా సినిమాలకు పనిచేస్తున్న సాయి మాధవ్ ట్రిపుల్ ఆర్ కోసం కూడా డైలాగ్స్ రాస్తున్నాడట. బాహుబలి సినిమాకే రాయాల్సి ఉన్నా అప్పుడు వేరే సినిమాల బిజీ వల్ల రాయడం కుదరలేదట. మొత్తానికి రాజమౌళితో సాయి మాధవ్ కాంబినేషన్ ఎలాంటి అవుట్ పుట్ తెస్తుందో చూడాలి.

ప్రస్తుతం బోయపాటి సినిమాతో రాం చరణ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక మరో పక్క త్రివిక్రం తో ఎన్.టి.ఆర్ అరవింద సమేత షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఎన్.టి.ఆర్ తో ముందు మొదలు పెడతాడా లేక చరణ్, తారక్ లతో ఒకేసారి ట్రిపుల్ ఆర్ మొదలు పెడతాడా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news