నాకు బాలయ్య, చిరంజీవి సినిమాలే ముఖ్యం.. అందుకే ఒక్క అడుగు వెనక్కి వేశా – దిల్ రాజు

-

నాకు బాలయ్య, చిరంజీవి సినిమాలే ముఖ్యం.. అందుకే ఒక్క అడుగు వెనక్కి వేశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. వారసుడు పై దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ…తెలుగులో వారసుడు విడుదల వాయిదా వేస్తున్నామని…వారసుడు తెలుగులో 14న విడుదల కానుందని వెల్లడించారు.

తమిళ్ లో యథావిధిగా 11న విడుదల చేయనున్నట్లు చెప్పారు. సినిమా థియేటర్లకు పోటీ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలి.. అందుకేనేను ఒక్క అడుగు వెనక్కి వేశానన్నారు. అందరు నిర్మాతలు బాగుండాలి…నా మీద అందరు పడి ఏడుస్తున్నారు..పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటూ ఫైర్ అయ్యారు దిల్ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news