వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై దర్శకుడు పరశురాం సంచలన వ్యాఖ్యలు

-

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిపై టాలీవుడ్‌ దర్శకుడు పరశురాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానిని తానని… ఆయన్ని చూస్తే ఒక హీరో అనే అనుభూతి కలుగుతుందని వెల్లడించారు పరశురాం. ఆయన వద్దకు ఏదైనా సమస్యని తీసుకెళితే ‘నేను విన్నాను..నేను ఉన్నాను’ అంటూ భరోసా ఇచ్చేవారని గుర్తు చేశారు.

సర్కారువారి పాటలో అలాంటి ఒక సందర్భంలో మహేష్‌ ఆ డైలాగ్‌ చెబుతున్నప్పుడు చాలా ఎంజాయ్‌ చేశారన్నారు డైరక్టర్ పరశురాం. మహేష్ బాబుతో సినిమా చేయాలనేది తన డ్రీమ్‌ అన్నారు. ‘సర్కారు వారి పాట’ ఆయన కోసం రాసిన కథ అని… దేవుడి దయ వల్ల ఆయనే చేయడంతో నా కల తీరిందని స్పష్టం చేశారు పరశురాం. ఈ చిత్రంలో బ్యాంక్‌ టాపిక్‌ ఉంటుంది కానీ మహేష్ బ్యాంక్‌ ఉద్యోగి కాదు. ఈ సినిమాలో ఒక వ్యక్తి గురించి కానీ, వ్యవస్థని ప్రశ్నించడం కానీ ఉండవని పేర్కొన్నారు డైరక్టర్ పరశురాం. కాగా.. ఈ మూవీ మే 12న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news