‘పసివాడి ప్రాణం’లో చిరంజీవితో కలిసి నటించిన ఆ పసివాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’ పిక్చర్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. విజయశాంతి ఇందులో హీరోయిన్ కాగా, చిరంజీవితో కలిసి నటించిన ఆ పసివాడి పాత్రనే మూవీకి హైలైట్ గా నిలిచింది. ఇందులో నటించిన ఆ పసివాడు చూడ ముచ్చటగా ఉండటంతో పాటు చక్కటి అభినయం కనబరుస్తాడు.

అలా ప్రేక్షకుల ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోయాడు ఆ బాబు. కానీ, నిజానికి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అబ్బాయి కాదు అమ్మాయి అన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండబోదు. ఆ పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్ట్ అమ్మాయి కాగా, ఆ అమ్మాయి పేరు సుజాత.

ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. సుజాత ఆ తర్వాత కాలంలో చిరంజీవికి సోదరిగా ‘జై చిరంజీవ’ చిత్రంలోనూ నటించింది.

ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే మరో వైపున సీరియల్స్ లో కూడా నటిస్తోంది. ఇక చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news