ఎన్.టి.ఆర్ తో ఎంటర్‌టైన్‌మెంట్ వర్కౌట్ అవుతుందా …?

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మొదటి నుండి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్ దగ్గర భారీ కమర్షియల్ సక్సస్ ని సాధించింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియోట్ చేసింది. అంతేకాదు దర్శకుడు త్రివిక్రమ్‌ కి కూడా ఈసినిమా గొప్ప పేరుని తెచ్చి పెట్టింది.

 

ఇక త్రివిక్రమ్ మరోసారి తన తర్వాతి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసాడు. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె.. హస్తినకు’ అనే టైటిల్‌ను ఖరారు చేసి లుక్ ని రిలీజ్ చేశారు కూడా. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం.

ఇక అల వైకుంఠపురము లో సినిమాకి ముందు ఎన్టీఆర్ పూజా హెగ్డే కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ వచ్చి మంచి కమర్షియల్ సక్సస్ ను సాధించన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు. ఫ్యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని చూపించిన విధానం సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఒక్క ఫస్ట్ ఫైట్ సినిమా రేంజ్ ఏంటో చూపించింది. అందుకే మరోసారి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే మరోసారి ఇలాంటి పవర్ ఫుల్ సినిమా అనే అందరూ అనుకుంటున్నారు. కాని తాజా సమాచారం ప్రకారం ‘అయినను పోయిరావలె.. హస్తినకు’ సినిమా కంప్లీట్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తుంది. ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ చాలా జోవియల్ గా చూపించబోతున్నారట. అయితే ఎన్టీఆర్ తో ఇలాంటి కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్ వర్కౌట్ అవుతుందా అని కొంతమంది సందేహాలని వ్యక్తపరుస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news