బిగ్ బ్రేకింగ్; ఏపీలో మరో 25 కరోనా పాజిటివ్ కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో మరో 25 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 252 కి చేరింది. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో కేసుల వేగంగా పెరుగుతున్నాయి. భారీగా కరోనా కేసులు నమోదు కావడం తో రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి మొదలయింది. ఇవాళ ఒక్క రోజే 25 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు అన్నీ కూడా కర్నూలు జిల్లాలోనే నమోదు అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో రెండు జిల్లాల్లో మినహా కరోనా కేసులు అన్ని జిల్లాల్లో భారీగా నమోదు అవుతున్నాయి. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, పశ్చిమగోదావరి తూర్పు గోదావరి ఇలా దాదాపు అన్ని జిల్లాలలోను కరోనా కేసులు నమోదు కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. కర్నూలు జిల్లాలో భారీగా కేసులు నమోదు కావడంతో జిల్లా వాసుల్లో భయం మొదలయింది. ఇక గుంటూరులో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news