బిగ్‌బాస్ సీజన్ 3 లో ఆ ఇద్దరు ఫేమస్ యాంకర్లు?

-

మిగితా కంటెస్టెంట్లలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ కూడా సీజన్‌తో మెరవనున్నారట. ఈ షో వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుందట. దానికి సంబంధించిన సెట్ కూడా వేస్తున్నారట. త్వరలోనే ప్రోమో విడుదలవుతుందట.

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకొని మూడో సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే బిగ్‌బాస్ సీజన్ 3 కంటెస్టెంట్లతో పాటు హోస్ట్‌ను కూడా నిర్వాహకులు ఎంపిక చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈసారి హోస్ట్‌గా కింగ్ నాగార్జున తీసుకున్నారట.

మరోవైపు కంటెస్టెంట్లను కూడా అన్ని రంగాల నుంచి ఈసారి ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లలో జరిగిన తప్పిదాలను ఈ సీజన్‌లో రిపీట్ కాకుండా బిగ్‌బాస్ నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అందుకే.. ఈసారి మాంచి కంటెంట్ ఉన్న కంటెస్టెంట్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. వాళ్ల పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే.. ఆ పేర్లలో ఇద్దరి పేర్లు కన్ఫమ్ అట. ఆ ఇద్దరు కూడా ఫేమస్ తెలుగు యాంకర్లు.. ఒకరేమో వీ6 తీన్‌మార్ వార్తల యాంకర్ సావిత్రి అయితే మరొకరు పటాస్ యాంకర్ శ్రీముఖి. సావిత్ర తెలంగాణ యాసతో అదరగొడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆమెకు పాపులారిటీ కూడా బాగానే ఉంది. మరోవైపు పటాస్ యాంకర్ శ్రీముఖి కూడా తన అందం, మాటలతో కుర్రకారుకు మతి పోగొడుతుంది. వీళ్లిద్దరు షోలో ఉంటే షోకు గ్లామర్‌తో పాటు షోలో కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని భావించిన బిగ్‌బాస్ నిర్వాహకులు వాళ్లిద్దరినీ కన్ఫమ్ చేశారట. అందుకే.. శ్రీముఖి ప్రస్తుతం పటాస్ షోలో కూడా నటించడం లేదని అంటున్నారు.

ఇక.. మిగితా కంటెస్టెంట్లలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ కూడా సీజన్‌తో మెరవనున్నారట. ఈ షో వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుందట. దానికి సంబంధించిన సెట్ కూడా వేస్తున్నారట. త్వరలోనే ప్రోమో విడుదలవుతుందట. కాకపోతే.. ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న గాసిప్స్. వీటిపై ఇప్పటివరకు బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news