BREAKING : బింబిసారా ఈవెంట్ లో అభిమాని మృతి !

-

కళ్యాణ్ రామ్ నటించిన “బింబిసార” ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే.. ఈ బింబిసారా ప్రీ ఈవెంట్ లో విషాదం చోటు చేసుకుంది.

బింబిసారా ఈవెంట్ లో ఓ అభిమాని మృతి చెందాడు. ఈవెంట్ లో అభిమాని అనుమాస్పద మృతి చెందాడు. పుట్టా సాయి రామ్ అనే అభిమాని మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.

ఉస్మానియా హాస్పిటల్ లో పోస్టుమార్టన్ నిమిత్తం తరలించారు అధికారులు. ఇక సంఘటన పై పోలీస్ ల విచారణ కొనసాగుతోంది. పుట్టా సాయిరామ్ ది ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గూడెం అని.. కూకట్పల్లి లో వుంటూ ప్రవేట్ జాబ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news