తెలుగు రాష్ట్రాలలో మొదటిసారి సమంత కోసం గుడి నిర్మిస్తున్న ఫ్యాన్స్..!

-

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇటీవల పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా కూడా చలామణి అవుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె శాకుంతలం సినిమా తో ప్రేక్షకులను నిరాశపరిచినప్పటికీ కూడా సమంత క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదని చెప్పవచ్చు. ఇకపోతే సమంత క్రేజ్ కి తగ్గట్టుగా ఒక అభిమాని ఆమె కోసం ఏకంగా గుడిని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ వాస్తవానికి హీరోయిన్స్ కి గుడి నిర్మించే సంస్కృతి తమిళ్ ఇండస్ట్రీలోనే ఉంది.

అయితే ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకిపోయింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలలో మొదటిసారి సమంత కోసం ఒక అభిమాని ఏకంగా గుడిని నిర్మిస్తున్నట్లు సమాచారం.అసలు విషయంలోకి వెళితే.. స్టార్ హీరో సమంత కోసం ఒక అభిమాని ఏకంగా తన ఇంటి ప్రాంగణంలోనే గుడి కట్టిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఆలపాడు కు చెందిన సందీప్ అనే వ్యక్తి తన ఇంట్లో సమంత కోసం గుడిని నిర్మిస్తున్నారని వార్త వెలుగులోకి వచ్చింది.

సమంత పై ఉన్న అభిమానంతో ఆయన ఇప్పటికే తిరుపతి, చెన్నై, నాగపట్నం వంటి దేవాలయాలకు వెళ్లి వచ్చాడు. ఇటీవల ఆమె మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న నేపథ్యంలో ఈ యాత్రలకు వెళ్లి వచ్చాడు. ఇకపోతే ఇప్పటికే విగ్రహం చివరి దశకు చేరుకొందని.. ఆ విగ్రహానికి సంబంధించిన గోపురం పనులు కూడా చేయిస్తున్నాడని వార్తలు బయటకు రావడంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకవైపు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆమె అభిమానులు మాత్రం తనపై ఉన్న ప్రేమను ఈ విధంగా కురిపిస్తున్నారు. ఈ విషయం తెలిసి పలువురు హీరోయిన్లు సైతం ఆశ్చర్యపోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news