పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహరవీరమల్లు నుంచి కీలక అప్డేట్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ మూవీ ఒకటి. నాలుగేళ్ల క్రితమే ఈ చిత్రం ప్రారంభించినా.. పవన్ కల్యాణ్ డేట్స్ కుదరకపోవడం వల్ల ఇంకా పూర్తి కాలేకపోయింది. ఈ కారణంగానే చిత్రం నుంచి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడు ఏపీలో ఎన్నికలు పూర్తి కావడంతో తన పెండింగ్ చిత్రాల షూటింగ్స్ పై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముందుగా సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న OG చిత్రాన్ని పూర్తి చేయాలని భావించినా అది సాధ్యం కాలేదట. అందుకే ఇక హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొగలుల కాలం నాటి నుంచి ఈ స్టోరీలో పవన్ కల్యాణ్ దోపిడీ దొంగ పాత్రలో నటిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారు. జూన్ 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని నిర్మాత ఏఎం రత్నం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో విలన్ గా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news