Gowtam Tinnanuri: తెలుగు దర్శకుడికి దక్కిన గౌరవం..ముంబై థియేటర్‌లో ప్రేక్షకుల స్టాండింగ్ ఒవేషన్

-

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్‌ను మించిపోతున్నదని చెప్పొచ్చు. ఒకప్పుడు బాలీవుడ్ మాత్రమే అతి పెద్ద ఇండస్ట్రీ అనే టాక్ ఉండేది. కానీ, సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. ఇటీవల విడుదలైన ‘పుష్ప, RRR, KGF2’ చిత్రాలు అక్కడ విశేష ఆదరణ పొందుతున్నాయి. కాగా, తాజాగా మరో చిత్రం నార్త్ ఇండియాలో సత్తా చాటుతోంది.

తెలుగులో సూపర్ హిట్ అయి నేషనల్ అవార్డు పొందిన చిత్రం ‘జెర్సీ’..ని హిందీలో రీమేక్ చేశారు. ఈ హిందీ రీమేక్ కు కూడా ఒరిజినల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరియే దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. గురువారం బాలీవుడ్ సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులకు స్పెషల్ షో వేయగా, వారు చిత్రం చూసి ఫిదా అయిపోయారు.

ఇక శుక్రవారం థియేటర్స్ లో పిక్చర్ చూసిన జనాలు గౌతమ్ తిన్ననూరి టేకింగ్ కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ముంబైలోని ఓ థియేటర్ లో సినిమా చూడటానికి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి వెళ్లగా, అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు గౌతమ్ తిన్ననూరిని చూడగానే అందరూ లేచి నిలబడి గౌరవం ఇచ్చారు.

అలా తెలుగు వాడైన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం పట్ల నెటిజన్లు, తెలుగు సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. గౌతమ్ తిన్ననూరి తన నెక్స్ట్ ఫిల్మ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నారు. #RC16 పిక్చర్ కూడా స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది.

https://www.instagram.com/reel/Cco2viiIYhb/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news