ప్రభాస్ కి తెల్లవారుజామున ఫోన్ చేస్తానన్న అనుష్క…!

-

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కి, స్టార్ హీరోయిన్ అనుష్క కి ఏదో ఉందీ అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దాదాపు మూడు నాలుగేళ్ళుగా ఈ ప్రచారం మరీ తీవ్ర స్థాయిలో జరుగుతూ వస్తుంది. సోషల్ మీడియాలో కూడా వీరి బంధం గురించి ఎక్కువగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మిర్చి, బిల్లా, బాహుబలి సినిమాల్లో వీరు ఇద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాల్లో బిల్లా ఒక్కటే ఫ్లాప్ అయింది.

ఇక అప్పటి నుంచి వీరు ఎక్కడ కనపడినా సరే పెళ్లి చేసుకుంటారు అనే ప్రచారం ఎప్పటి నుంచో చేస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అన్నారు. దీనిపై ఆమె తాజాగా మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక ఇంటర్వ్యు లో మాట్లాడిన ఆమె, తనకు 15 ఏళ్లుగా ప్రభాస్ తెలుసని, తెల్లవారుజామున 3 గంటలకు కూడా అతనితో మాట్లాడే సాన్నిహిత్యం ఉందని చెప్పింది.

ప్రభాస్‌కు పెళ్లి కాకపోవడం, నాకూ పెళ్లి కాకపోవడంతోనే మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారని ఆమె వివరించింది. ఒకవేళ నిజంగానే మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉంటే, ఇప్పటికే తెలిసేదని చెప్పారు. మేమే చెప్పేవాళ్లమన్నారు కానీ మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. మా ఇద్దరి మనస్తత్వం ఒకటేనని, ఇద్దరికీ భావోద్వేగాలు ఎక్కువ అని ఆమె వివరించారు. కాగా త్వరలో అనుష్క పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news