మహేష్ – రాజమౌళి మూవీ లో హీరోయిన్ ఫిక్స్..!!

-

మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ బాబు విదేశాలకు వెళ్లడంతో సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇక మరికొద్ది రోజుల్లోనే సినిమా షూటింగు సెట్ పైకి వెళ్ళనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పూర్తయినట్లు త్వరలోనే షూటింగ్ మొదలు పెడతామని కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కొనసాగుతుంది అని ఇక మహేష్ బాబు జీవితంలో ఇది మరువలేని సినిమా అవుతుందని కూడా విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో తాజాగా హీరోయిన్ కూడా ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరు అనే విషయానికి వస్తే నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు చిత్ర దర్శక నిర్మాతలు ఈమెను సంప్రదించగా దీపికా పదుకొనే కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది.

ఇకపోతే మహేష్ బాబు సరసన దీపికా పదుకొనే నటించబోతోంది అని తెలిసి మహేష్ బాబు అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీపికా పదుకొనే ఇప్పుడు ది రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేస్ అనే ఒక హాలీవుడ్ చిత్రంలో నటించడంతో కొంత ప్లస్ అవుతుంది అని ఆమెను చిత్ర బృందం ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే భారీ సాహసంతో కూడిన థ్రిల్లర్ మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి వెల్లడించారు. ముఖ్యంగా మహేష్ బాబుతో చేయబోయే ఈ సినిమాను లోకం చుట్టిన వీరుడు నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news