ఆ వ్యక్తి క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది..!!

-

టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్లలో ఒకరైన హైపర్ ఆది బుల్లితెర పైన మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ తోనే వెండితెర పైన పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. హైపర్ ఆది కమెడియన్ గా నటించిన సినిమాలలోని డైలాగులు హైలైట్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ధనుష్ నటించిన సార్ మూవీలో కూడా ఆది నటన ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే సార్ మూవీ సక్సెస్ మీట్ లో హైపర్ ఆది చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

హైపర్ ఆది మాట్లాడుతూ డబ్బుకు కాకుండా మనుషులకు మనస్తత్వలకు విలువనిచ్చే వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి అని ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన నారాయణమూర్తి గురించి హైపర్ ఆది తెలియజేయడం జరిగింది. ఒక సామాన్యుని గురించి పోరాడాలంటే మనం సామాన్యుడు గానే ఉండాలని ఆయన భావిస్తారని హైపర్ ఆది తెలిపారు. సార్ మూవీ ఒక గుడ్ ఫిలిమ్ అని తెలిపారు హైపర్ ఆది.

అయితే ఈ చిత్రం బాగా చదువుకొని వాళ్లకు చదువు విలువ తెలిసేలా చేసిందని.. చదువుకున్న వాళ్లకు కూడా ఎలా ప్రవర్తించాలో చేసేలా చేసిందని తెలిపారు హైపర్ ఆది. ఈ చిత్రంతో ధనుష్ పైన ప్రేమ మరింత పెరిగిందని ఈ సినిమా వల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు వస్తుందని తెలిపారు. ఈ రోజుల్లో ప్రేమ అంటే చాలా దారుణంగా ఉందని తెలిపారు. ఈ సినిమా చూసిన తర్వాత మా సార్ సుబ్రహ్మణ్యం సార్ కు కాల్ చేసి తప్పు చేసి ఉంటే క్షమించమని అడిగానని చెప్పగా.. రాంగ్ నెంబర్ అని చెప్పి పెట్టేసారని హైపర్ ఆది తెలిపారు. ఆ తర్వాత నెంబర్ కరెక్ట్ గా కనుక్కొని మరి ఫోన్ చేసి సారీ చెప్పానని తెలిపారు హైపర్ ఆది.

Read more RELATED
Recommended to you

Latest news