అలాంటివి విని తట్టుకోలేక.. వాష్ రూమ్ లోకి వెళ్లి.. ఏడ్చేదాన్ని.. అదితి రావు ..!

-

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అదితి రావు హైదరీ బాగా సపరిచితమే. ఈ మధ్యకాలంలో హీరో సిద్ధార్ధ్ తో ప్రేమాయణం నడుపుతోంది అనే వార్తలతో మరింత పాపులారిటీ సంపాదించింది. మొదట సమ్మోహనం చిత్రంతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మెప్పించింది. ముఖ్యంగా తన అందాల ఆరబోత విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు అంతగా రావడం లేదని చెప్పవచ్చు.

చివరిగా అదితి రావు హైదరీ శర్వానంద్, సిద్ధార్ధ్ నటించిన మహాసముద్రం సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ. ఇమే తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ వంటి భాషలలో నటించింది. అదితి రావు హైదరీ పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్ధ్ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ నా హృదయ రాకుమారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేయడంతో ఈ విషయం మరింత వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈ ముద్దుగుమ్మ తన కెరియర్లో జరిగిన కొన్ని విషయాలను తెలియజేసింది.

అదితి రావు హైదరీ మాట్లాడుతూ తన సినిమాలలోకి రావడానికి ముందు చాలా అవమానాలను ఎదుర్కొన్నానని తెలియజేసింది. ముందు నేను భారత నాట్యంలో ప్రావీణ్యం సంపాదించాను.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు కూడా చేశానని తన ప్రదర్శనలు చూసి కోలీవుడ్ డైరెక్టర్ శారద తనకు మొదటిసారి సినిమాలో అవకాశం ఇచ్చిందని తెలిపింది. అయితే ఆ సినిమా విడుదల మాత్రం చాలా ఆలస్యమైందట. దీంతో తను ఎన్నోసార్లు బాధపడ్డానని తను నటించిన మొదటి సినిమా ఇలా అడ్డంకులు రావడంతో చాలా ఫీల్ అయ్యేదట.ఇలాంటివి విని తట్టుకోలేక..ఈ విషయం తన తల్లి ముందు తెలిసి ఏడిస్తే తాను తట్టుకోలేదని వాష్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేదాన్ని అంటూ తెలియజేసింది. ఇక తను నటించిన మొదటి చిత్రం ఆలయ నర్తకి. కానీ ఈ సినిమా కంటే ముందుగా ప్రజాపతి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మమ్ముట్టి నటించారట.

Read more RELATED
Recommended to you

Latest news