‘జై భీమ్’ చిత్రానికి మరో రెండు ప్రెస్టీజియస్ అవార్డులు..

-

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య..చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోనే సమాజాన్ని ఆలోచింపజేసే సినిమాలూ చేస్తుంటారు. ఆయన చేసిన చిత్రాల్లో ఆ కోవకు చెందిన చిత్రం ‘జై భీమ్’.

కరోనా సమయంలో OTT అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణ పొందింది ఈ జై భీమ్ పిక్చర్. టీజే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ కు ఇటీవల ‘‘దాదా సాహేబ్‌ ఫాల్కే ఫిలీం ఫెస్టివల్‌’లో రెండు అవార్డులు లభించాయి. తాజాగా ‘‘జై భీమ్‌’’ సినిమా మరో రెండు అవార్డులను సాధించింది. అలా ఈ సినిమాకు అవార్డులు వరిస్తూనే ఉన్నాయి.

ఈ ఏడాది గత నెల 14 నుంచి 20 వరకు జరిగిన ‘బోస్టన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ‘జై భీమ్‌’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘జై భీమ్’ చిత్రంలో నటించిన నటి లియోమోల్‌ జోస్‌కు ‘ఇండీ స్పిరిట్ బెస్ట్‌ యాక్ట్రెస్’ అవార్డు ఇచ్చారు. ‘ఇండీ స్పిరిట్ బెస్ట్‌ సినిమాటోగ్రఫీ’ అవార్డును కెమెరామెన్‌ ఎస్‌.ఆర్‌. కదీర్‌ కు ఇచ్చారు.

మరో రెండు అవార్డులు అందుకున్నందుకు మూవీ యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రొడక్షన్ హౌజ్ ‘2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ ఈ విషయమై ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. స్టార్ హీరో సూర్య, జ్యోతిక కలిసి తమ ఓన్ ప్రొడక్షన్ హౌజ్ ‘2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ బ్యానర్ పై ‘జై భీమ్‌’ పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు. ఈ పిక్చర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవెయిలబుల్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news