రాజ్‌నాథ్‌సింగ్‌తో విజయ్ దేవరకొండ.. రక్షణ శాఖ సహకారం ‘జనగణమన’ టీమ్..

-

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన(జేజీఎం)’ అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఈ చిత్రాన్ని చేయబోతున్న పూరీ.. ఇందులోనూ హీరోయిన్ గా అనన్యా పాండేను సెలక్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్, విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఫిల్మ్ పై అంచనాలను అమాంతగా పెంచేశాయి.

వచ్చే ఏడాది ఆగస్టు 3న చిత్రాన్ని విడుదల చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ పైన ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తు్న్నారు. అందులో భాగంగానే ‘జేజీఎం’ మూవీ యూనిట్ సభ్యులు హీరో విజయ్ దేవరకొండ, చార్మి ఇతరులు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను తాజాగా కలిశారు. చిత్ర షూటింగ్ కోసం సహాయ సహకారాలను కోరారు. రక్షణశాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు జేజీఎం టీమ్ మెంబర్స్.

ఆర్మీ ఆఫీసర్ గా ఇందులో విజయ్ దేవరకొండ కనిపించనుండగా, చాలెంజింగ్ రోల్ కోసం తాను రెడీగా ఉన్నానని విజయ్ దేవరకొండ చెప్పాడు. దేశం కోసం ఈ స్టోరిని రచించినట్లు పూరీ జగన్నాథ్ తెలిపారు. గతంలో ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయాలనుకున్నాడు.

‘బిజినెస్ మ్యాన్’ చిత్రం తర్వాత ఈ సినిమా చేయాల్సింది. కానీ, అలా పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. చివరకు ఈ స్టోరి విజయ్ దేవరకొండ వద్దకు వచ్చింది. వీరి కాంబోలో పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ ఏడాది ఆగస్టు 25న ‘లైగర్’ రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news