వారి వెనకాలే పడ్డ జూనియర్ ఎన్టీఆర్.. సరికొత్త అప్డేట్ ఏంటంటే..?

-

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత తన సినిమాలను కూడా అదే రేంజిలో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సౌత్ ఇండియన్ హీరోయిన్స్ ని పక్కన పెట్టి ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ వెనకాల పడ్డారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఆర్ఆర్ఆర్ సినిమాను మొదలుకొని ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాలో కూడా బాలీవుడ్ హీరోయిన్ లేదా హాలీవుడ్ హీరోయిన్ ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ తో జతకట్టగా ఇప్పుడు ఆయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తన 30 వ చిత్రంలో హీరోయిన్గా అందాల తార బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న మరొక సమాచారం ఏమిటంటే.. కొరటాల శివతో సినిమా పూర్తయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కేజిఎఫ్ 1,2 చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

అయితే ఇందులో ఎన్టీఆర్ సరసన సాహో సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రద్ధ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించనుంది అనే వార్తలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఇప్పుడు వరుసగా బాలీవుడ్ హీరోయిన్లను ఆయన తన సినిమాలో పెట్టుకుంటుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే సౌత్ హీరోయిన్ లకు పాన్ ఇండియా స్టేటస్ కలిగించరా అంటూ మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వరుసగా బాలీవుడ్ హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో చిత్రబృందం చెప్పే వరకు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news