షారుక్​ మూవీకి లైగర్​కి లింక్.. సోషల్​ మీడియాలో ట్రెండింగ్.. మ్యాటర్ ఏంటంటే?

-

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ‘లైగర్​’. భారీ అంచనాలతో ఈ నెలలోనే విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్​ ఫుల్​ స్వింగ్​లో సాగుతున్నాయి. విజయ్​-అనన్య దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి స్థానికులతో కలిసి ముచ్చటిస్తూ సినిమాను వినూత్నంగా ప్రమోట్​ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్​, టీజర్స్​, ట్రైలర్ విడుదలై యూత్​ను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో విజయ్‌ దేవరకొండ‌ యాక్షన్​ సీక్వెన్స్​, స్టంట్స్‌, దిగ్గజ బాక్సర్‌ మైక్‌టైసన్‌తో బాక్సింగ్‌ సన్నివేశాలు, హీరోయిన్​ అనన్య పాండే రొమాన్స్‌.. ఇలా ప్రతీది ​ సినిమాపై ఓ రేంజ్​లో ఎక్స్​పెట్టేషన్స్​ను పెంచేశాయి.

ఈ నేపథ్యంలో లైగర్‌ ప్రమోషన్స్‌లో బిజీ, బిజీగా పాల్గొంటున్నారు విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే. తమ చిత్రాన్ని ప్రమోట్‌ చేయడం కోసం ఈ జోడీ గత కొన్నిరోజుల నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు కలియదిరుగుతున్నారు. తాజాగా ఈ జోడీ బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌ నటించిన ఓ సూపర్‌ హిట్‌ చిత్రాన్ని గుర్తు చేస్తోంది. ఈ జోడీని చూసిన నెటిజన్లు క్యూట్‌ పెయిర్‌ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ విజయ్‌ – అనన్య ఏం చేశారంటే?

లైగర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఈ చిత్రబృందం పంజాబ్‌లో పర్యటించింది. చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ సినిమా నుంచి కోకా కోకా సాంగ్‌ని విడుదల చేసింది. ఇక, విజయ్‌ – అనన్య సంప్రదాయ దుస్తులు ధరించి ఈ ఈవెంట్‌లో పాల్గొని అందర్నీ ఆకర్షించారు. అయితే ఈవెంట్‌కు ముందు వీరిద్దరూ చుట్టపక్కల ప్రాంతాల్లోని పొలాల్లోకి వెళ్లి ఫొటోలకు పోజులిచ్చారు. కొన్ని ఫొటోల్లో విజయ్‌.. అనన్యను ఎత్తుకోగా.. మరికొన్ని చోట్ల వీరిద్దరూ కలిసి ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్నట్లు దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ పంజాబ్‌ తనకెంతో నచ్చిందని అన్నారు. ఈ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్‌ కావడంతో వీటిని చూసిన నెటిజన్లు.. ‘మీ ఫొటోలు చూస్తుంటే షారుఖ్‌ నటించిన ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’ గుర్తుకువస్తోంది’, ‘క్యూట్‌ పెయిర్‌’ అని కామెంట్స్ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈసినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. ఇందులో విజయ్ ముంబయి మురికివాడకు చెందిన యువకుడిగా, ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన పాత్ర నత్తితో ఇబ్బందిపడే వ్యక్తిగా రూపుదిద్దుకుంది. ఆయన తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అనన్యా పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌ కీలకపాత్ర పోషించారు. విజయ్‌ దేవరకొండ నటించిన మొదటి పాన్‌ ఇండియా సినిమా ఇది. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news