ఓనమ్ పండుగకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మహానటి..!!

-

ప్రముఖ హీరోయిన్ మేనక వారసురాలిగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన కీర్తి సురేష్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇక మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఎంతోమంది అబ్బాయిల కలల రాకుమారిగా మారిపోయింది . అన్నీ కూడా సెలెక్టివ్ పాత్రలను ఎంచుకుంటూ ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మొన్నటి వరకు గ్లామర్ షో కి దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల గ్లామర్ షో కూడా చేస్తూ మరింత రెచ్చిపోతోందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా తాజాగా కేరళ ప్రజలు ఓనమ్ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. మలయాళీయులకు అతి పెద్ద పండుగ ఓనమ్ అని చెప్పాలి. పది రోజులపాటు ఎంతో సంబరంగా జరిగే ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే కేరళ కుట్టి కీర్తి సురేష్ కూడా గోల్డెన్ కలర్ బార్డర్ కలిగిన క్రీం కలర్ శారీని కట్టుకొని , అందమైన రెడ్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్ ధరించి చూపర్లను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఫోటోలకు.. ఈమె ఒంపు సంపులు పోతూ కొంటె చూపులతో ఫోజులు ఇవ్వడం కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చుకుంటున్నాయని చెప్పవచ్చు. తెల్లచీర.. మల్లెపూలు అంటూ ఈమెను చూసిన నేటిజనులు సైతం పాట పాడుతున్నారు అని చెప్పాలి..

ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె సినిమాలో కూడా వరుసగా ఫ్లాప్ అవడంతో రీసెంట్గా వచ్చిన సర్కారు వారి పాట తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో నటిస్తోంది. మరొకవైపు చిరంజీవికి చెల్లిగా భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది. తమిళ్, మలయాళం భాషల్లో కూడా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ సినిమాలతోనైనా బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news