డైరక్టర్ పార్టీలో మహేష్, తారక్ .. వైరల్ గా మారిన పిక్స్..!

-

సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు ఓ చోట కలిస్తే.. వారిద్దరి సరదా మీటింగ్ ఏమో కాని ఇక్కడ ఫ్యాన్స్ సంబరం ఓ రేంజ్ లో ఉంటుంది. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి మహేష్ అన్నయ్యకు సక్సెస్ రావాలంటూ సెంటిమెంట్ తో కొట్టిన తారక్ ఆ తర్వాత వీలు కుదిరినప్పుడల్లా తాము స్టార్స్ అని ఈగోలకు పోకుండా తరచు కలుస్తూనే ఉన్నారు. తారక్, చరణ్ ల ఫ్రెండ్ షిప్ గ్యాప్ లో మహేష్ కూడా జాయిన్ అయ్యాడు.

అయితే ఎప్పుడు ముగ్గురు ఫోటోలు దిగి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ చేస్తారు. లేటెస్ట్ గా తారక్, మహేష్ మరోసారి ఫ్యాన్స్ ను కనువిందు చేశారు. డైరక్టర్ వంశీ పైడిపల్లి భార్య మాలిని పుట్టినరోజు సందర్భంగా సోమవారం వంశీ పైడిపల్లి ఇచ్చిన పార్టీలో మహేష్, తారక్ పాల్గొన్నారు. వారిద్దరే కాదు వాళ్ల సతీమణులు వెంట ఉన్నారు.

మహేష్ అండ్ తారక్ అండ్ వంశీ పైడిపల్లి ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్ బర్త్ డేలకు మనం వెల్లడం కాదు స్టార్స్ తన బర్త్ డేకు రావడం పట్ల కచ్చితంగా మాలిని ఈ బర్త్ డే మరింత ఆనందంగా ఉండొచ్చు. వంశీ పైడిపల్లితో మహేష్ మహర్షి సినిమా చేస్తున్నాడు. తారక్ తో బృందావనం తీశాడు. అప్పటినుండి తారక్ తో స్నేహంగా ఉంటున్నాడు. మహర్షి సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజై సూపర్ అనిపించుకుంది. మే 9న ఈ సినిమా రిలీజ్ అవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news