మ‌హేష్ ని వెంటాడుతోన్న ఖాకి !

-

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం అనీల్ రావిపూడితో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా చేస్తున్నాడు. అది పూర్తికాగానే అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగ‌తో సినిమా చేయ‌నున్నాడు. ఈ రెండు పూర్తిచేయ‌డానికే మ‌హేష్ కు రెండేళ్లు స‌మ‌యం ప‌డుతుంది. ఈ రెండింటి త‌ర్వాత రాజ‌మౌళి, సుకుమార్ లు మహేష్ కోసం రెడీగా ఉన్నారు. ఇవ‌న్నీ ఓ ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగితే మూడు నాలుగేళ్ల‌లో ఈ సినిమాల‌న్నీ పూర్త‌వుతాయి. అయితే ఏడాది క్రితం నుంచి మ‌హేష్ ని ఖాకి ద‌ర్శ‌కుడు హెచ్ . వినోథ్ వెంటాడుతున్నాడని మ‌రోసారి కోలీవుడ్ లో వార్త‌లు ఊపందుకున్నాయి. త‌మిళ ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్ ద్వారా మ‌హేష్ ని వినోథ్ క‌లిసిన‌ట్లు ఓ వార్త వ‌చ్చింది.

Mahesh babu to act in khaki direction

ఓ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతోన్న స‌మ‌యంలో మ‌హేష్ కి స్టోరీ లైన్ వినిపించిన‌ట్లు..మ‌హేష్ కూడా ఆస‌క్తి చూపించిన‌ట్లు ప్ర‌చారం సాగింది. బౌండెడ్ స్ర్కిప్ట్ తో మ‌రోసారి మీట్ అవ్వ‌మ‌ని మ‌హేష్ చెప్పిన‌ట్లు అప్ప‌ట్లోనే వార్త‌లొచ్చాయి. కానీ త‌ర్వాత దీనిపై ఎలాంటి అప్ డేట్ రాలేదు. త‌ర్వాత వినోథ్ వేరే సినిమాలతో బిజీ అవ్వ‌డంతో అవి గాలి వార్త‌లగాల‌నే భావించాల్సి వ‌చ్చింది. అయితే తాజాగా మ‌రోసారి వినోథ్, మ‌హేష్ ని హైద‌రాబాద్లో సంప్ర‌దించిన‌ట్లు క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలిసింది. దాదాపు ఇద్దిర మ‌ధ్య మూడు గంట‌ల‌కు పైగా మీటింగ్ జ‌రిగినట్లు లీకులందాయి. ఆ మీటింగ్ సారాశం స్టోరీ డిస్క‌ష‌న్ అయి ఉంటుంద‌ని అంటున్నారు. ఏదేమైనా ఈ రూమ‌ర్ ఇప్పుడు టాలీవుడ్ మీడియాలో ఆస‌క్తిక‌రంగా మారింది.

ఖాకి ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్. తొలి సినిమా ఖాకీ తోనే నిరూపించుకున్నాడు. మంచి టెక్నిషీయ‌న్ గా కోలీవుడ్ లో గుర్తింపు ఉంది. త‌మిళనాడులో జ‌రిగిన లారీ దొంగ‌ల చోరీ, హ‌త్య‌ల నేప‌త్యంతో.. వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఖాకీని ఓ రేంజ్ లో తీసాడు. సినిమాటిక్ ని ఫాలోయి అయినా రియ‌ల్ స్టిక్ అనుభూతి క‌ల్గించాడు. అందుకే మ‌హేష్ వ‌ర‌కూ రాగ‌లిగాడు. మ‌రి ఇందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం వినోథ్ అజిత్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే మ‌రో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news